తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయింపు.. బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంతోనే: కిషన్‌రెడ్డి

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న విమర్శలను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఖండించారు. బడ్జెట్ ప్రకటనలను ఉచితాల కోసం మాత్రమే చేశారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాదని, వికసిత భారత్ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని ఆయన స్పష్టం చేశారు.

పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 4.30 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు స్వంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమతుల్యంగా ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

అలాగే జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు మౌలిక వసతులు విస్తరించడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో దేశ అభివృద్ధికి అవసరమైన రంగాలన్నింటికీ సముచిత నిధులు కేటాయించామని, ప్రజలకు ఉపయోగపడే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు నమ్మకం ఉంచాలని కిషన్‌రెడ్డి కోరారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...