అమెరికాలో ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి తరగతులు

Published on

-Advertisement-

మన భారత్ , తెలంగాణ:

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ (Leadership in the 21st Century) కోర్సు ప్రారంభమైంది.

ఈ కోర్సులో భాగంగా ‘అధికార విశ్లేషణ – నాయకత్వం’ అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. సమకాలీన పాలన, నాయకత్వ సవాళ్లు, నిర్ణయాల ప్రక్రియపై లోతైన అవగాహన కల్పించేలా ఈ సెషన్ సాగింది. కేస్ అనాలిసిస్, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి శిక్షణాత్మక కార్యక్రమాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు.

ప్రపంచ స్థాయి విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్ లీడర్‌షిప్ ధోరణులు, పాలనా నూతన ఆలోచనలు తెలుసుకునే అవకాశం లభిస్తోందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ప్రజాపాలనలో ఉత్తమ విధానాల అమలుకు ఈ శిక్షణ ఉపయోగపడనుందని అభిప్రాయం వ్యక్తమైంది.

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపునిచ్చే అంశంగా రాజకీయ, విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...