కార్యకర్తలకు ముందస్తు సమాచారం..!

Published on

-Advertisement-

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి పర్యటన వివరాలు

మన భారత్, ఆదిలాబాద్:

బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి (ఆదివారం, తేదీ: 18-01-2026) పర్యటన వివరాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కే.ఏ.కే వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 09.30 గంటలకు నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించనున్నారు. అక్కడ స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలుసుకుని సమస్యలను తెలుసుకోనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 01.00 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని, సోదరభావాన్ని చాటేలా సందేశం ఇవ్వనున్నారు.

తదుపరి మధ్యాహ్నం 03.30 గంటలకు బోథ్ మండలంలోని కౌట ‘బి’ గ్రామంలో నిర్వహించిన గంగేశ్వర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కాప్సె అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.


 

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...