హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల ఊగిసలాట
మన భారత్, హైదరాబాద్:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, డాలర్ మారకం విలువలో హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు పైకి కదిలినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,46,280కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,31,800గా నమోదైంది.
అటు వెండి ధరలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.3,10,000కు చేరింది. ఇటీవల పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాల కారణంగా వెండి ధరలు పైబాట పట్టినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరలు మరింత మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
