హెల్మెట్ ధరించాలని పోలీసుల బైక్ ర్యాలీ..

Published on

-Advertisement-

నిర్లక్ష్యం వద్దు… హెల్మెట్‌ ధరించడం ముద్దు

మన భారత్ | తాంసి

ప్రతి ఒక్క వాహనదారుడు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రయాణాలు చేపట్టాలని ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ ఫణిదర్‌ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం తాంసి మండల కేంద్రంలో హెల్మెట్‌ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జీవన్‌ రెడ్డితో కలిసి వాహనదారులకు హెల్మెట్‌ ప్రాధాన్యతను వివరించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్‌ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అవగాహన కార్యక్రమంలో భాగంగా తాంసి మండల కేంద్రంలోని పలు వీధుల గుండా హెల్మెట్‌ ధరించి వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తమతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులే కాకుండా ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీఐ ఫణిదర్‌ కోరారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అరుణ్‌, సంతోష్‌ రెడ్డితో పాటు ఆయా గ్రామాల యువత, పోలీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...