చంద్రబాబుకు సూటిగా చెప్పా: అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర హక్కులు, ముఖ్యంగా నీటి వనరుల విషయంలో తాను ఎక్కడా రాజీపడనని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేస్తేనే చర్చలకు వస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూటిగా చెప్పినట్లు సభలో వెల్లడించారు.
తన ఒత్తిడితోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణకు అన్యాయం జరిగే అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు మొదటి ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. “ప్రాంతం తర్వాతే పార్టీ” అనే నినాదంతోనే గతంలో తాను రాజకీయంగా బయటకు వచ్చానని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణే తన రాజకీయ లక్ష్యమని, అవసరమైతే ఎంతటి శక్తివంతులైనా ఎదుర్కొంటానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి వెనకడుగు ఉండదని, ప్రజల తరఫున నిరంతరం పోరాటం సాగిస్తానని సీఎం తేల్చిచెప్పారు.
