“సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… ఆధ్యాత్మిక శాస్త్రం!” — డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మన భారత్, ఉడుపి (AP): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో పాల్గొన్న ఆయన, “సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… శాస్త్రీయత, ఆధ్యాత్మికత కలగలిసిన జీవన విధానం” అని వెల్లడించారు.
🔹 ‘మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది’
పవన్ మాట్లాడుతూ, తమిళనాడులో సనాతన ధర్మ ఆచారాలు పాటించేందుకు కూడా న్యాయపోరాటాలు చేయాల్సిరావడం విచారకరమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి హిందువులో చైతన్యం పెరగాలని పిలుపునిచ్చారు.
🔹 యువతకు గీత అవశ్యం – పవన్ సందేశం
భగవద్గీత ప్రాముఖ్యతను హైలైట్ చేసిన పవన్ కళ్యాణ్ అన్నారు—
“గీత ఏ ప్రాంతం, ఏ మతానికి మాత్రమే యోగ్యమైన గ్రంథం కాదు. జీవితం గందరగోళంలో పడితే… మనసు కుంగిపోయినా… గీత మార్గదర్శకత్వం ఇస్తుంది. కౌన్సిలర్గా, మెంటర్గా పనిచేస్తుంది.”
యువత తప్పనిసరిగా గీత చదవాలని, అది వ్యక్తిత్వ వికాసానికి పునాది వేస్తుందని పవన్ సూచించారు.
🔹 ఆధ్యాత్మిక చైతన్యానికి కొత్త ఊపు
ఉడుపి క్షేత్ర సందర్శన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు భక్తులకు, యువతకు మరింత ఆధ్యాత్మిక అవగాహన పెంచేలా ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంపై పెరుగుతున్న వాదోపవాదాల నడుమ పవన్ చేసిన స్పష్టమైన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
