కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

Published on

-Advertisement-

కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మన భారత్ – స్టేట్ డెస్క్ కాన్పూర్: దేశ రాజకీయ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో కాన్పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

శ్రీప్రకాశ్ జైస్వాల్ 2004 నుండి 2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం 2011 నుండి 2014 వరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు చేరువై పనిచేసిన నాయకుడిగా పేరుపొందారు. కేంద్ర మంత్రిత్వానికి ముందు 2000–2002 మధ్య ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (UPCC) అధ్యక్షుడిగా సేవలు అందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతగా ఆయనను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు.

శ్రీప్రకాశ్ జైస్వాల్ మృతి పట్ల అనేక అగ్ర నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన సేవలను జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....