కాలుష్య నిరసనల్లో ‘హిడ్మా’ పోస్టర్లు కేసు నమోదు

Published on

-Advertisement-

కాలుష్య నిరసనల్లో ‘హిడ్మా’ పోస్టర్లు… ఢిల్లీలో వివాదం, కేసు నమోదు

మన భారత్, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై జరుగుతున్న నిరసనలు కొత్త వివాదానికి దారితీశాయి. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ పలువురు యువకులు ఢిల్లీ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే నిరసన సమయంలో ఇటీవల హతమైన మావో అగ్రనేత హిడ్మా పోస్టర్లు ప్రదర్శించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

బిర్సా ముండా నుంచి మాద్వి హిడ్మా వరకు… మన అడవులు, పర్యావరణం కోసం పోరాటం కొనసాగింది. రెడ్ సెల్యూట్ హిడ్మా’ అంటూ పోస్టర్లపై నినాదాలు కనిపించాయి. పర్యావరణ నిరసనలో హిడ్మా పేరును వినియోగించడం పోలీసులు, భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.

తర్వాత సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహ అనుమానాలు, నిషేధిత సంస్థల ప్రచారం వంటి అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నిరసనల్లో పాల్గొన్నవారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వారు వెల్లడించారు.

ఈ ఘటనతో ఢిల్లీలో కాలుష్య నిరసనలకు కొత్త మలుపు తిరిగింది. పర్యావరణ సమస్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, హిడ్మా పోస్టర్లు చేర్చడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....