వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం…మోదీ

Published on

-Advertisement-

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం… ఐబీఎస్ఏ నాయకులతో ప్రధాని మోదీ చర్చలు

మన భారత్, జొహానెస్బర్గ్ :  జొహానెస్బర్గ్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌లో ఐబీఎస్ఏ (ఇండియా–బ్రెజిల్–సౌత్ ఆఫ్రికా) నాయకుల సమావేశం కీలకంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో విస్తృత చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ, వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలిచే వ్యవసాయ వ్యవస్థల కోసం ‘IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్’ ఏర్పాటు అత్యవసరం అని స్పష్టం చేశారు. డిజిటల్ రంగంలో అభివృద్ధి, సాంకేతిక వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ప్ ప్రాముఖ్యత ను కూడా వివరించారు.

విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఐబీఎస్ఏ ఇప్పటికే 40కి పైగా దేశాలకు అందిస్తున్న మద్దతు ప్రశంసనీయం అని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐబీఎస్ఏ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జి20 వేదికగా జరిగిన ఈ సమావేశం దక్షిణ గోళార్ధ దేశాల సహకారానికి కొత్త దిశగా భావిస్తున్నారు.

 

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...