ఆర్మూర్లో మద్యం మత్తులో డ్రైవింగ్… కోర్టు రూ.10,000 జరిమానా విధింపు
మన భారత్, నిజామాబాద్ : ఆర్మూర్లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో స్థానిక కోర్టు భారీ జరిమానా విధించింది. నవంబర్ 19, 2025న జరిగిన ఈ ఘటనలో వి. మల్లేష్ నర్సింహ అనే వ్యక్తిని పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన ఆర్మూర్ స్పెషల్ జూడీషియల్ రెండవ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై రూ.10,000 (పది వేల రూపాయలు) జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విడుదల చేసిన రసీదు ప్రకారం, నిందితుడు మద్యం సేవించి వాహనం నడపడం కారణంగా ఈ శిక్ష విధించబడింది.
పోలీసులు ఇటువంటి చర్యలు ప్రజల రక్షణ కోసం చేపడుతున్నాయిని, మద్యం మత్తులో వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇలాంటి జరిమానాలు విధించడం ద్వారా ప్రమాదాలను అడ్డుకోవడం లక్ష్యమని అధికారులు తెలిపారు.
