విద్యలో నూతన దశకు నాంది..

Published on

-Advertisement-

విద్యలో నూతన దశకు నాంది: AIతో విద్యార్థుల జవాబు పత్రాల వాల్యుయేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ  టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం విద్యా రంగంలో మరో ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో (Valuation) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం కోసం అధికారులు ముందడుగు వేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా పాలిటెక్నిక్ స్దాయిలో రెండు సబ్జెక్టుల్లో అమలు చేయాలనే ప్రణాళిక సిద్ధమైంది.

అధికారుల సమాచారం మేరకు… పైలట్ దశలో AI సిస్టమ్‌ ద్వారా దిద్దిన పత్రాలను లెక్చరర్లు మరోసారి చెక్ చేయనున్నారు. ఇది విద్యార్థుల మార్కులపై ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పిన టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు, AI ఆధారిత మూల్యాంకన విధానం సమయం ఆదా చేస్తుందని, మానవ తప్పిదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

అయితే విద్యార్థుల హస్తప్రతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండటం వల్ల AI ఎలాంటి సవ్యమైన మూల్యాంకనం చేస్తుందన్న ఆసక్తి, సందేహాలూ పెరుగుతున్నాయి. రైటింగ్ స్టైల్, ప్రెజెంటేషన్, కంటెంట్ నాణ్యతను AI ఎంతవరకు ఖచ్చితంగా గుర్తిస్తుందో పైలట్ ప్రాజెక్టే తేలుస్తుందని అధికారులు తెలిపారు.

తెలంగాణలో మొదటిసారిగా జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో AI ప్రవేశపెట్టనుండటం రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలక పరిణామంగా అభిలషిస్తున్నారు.

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...