అపూర్వమైన ఆరోగ్యానికి ‘ఇప్ప పువ్వు లడ్డు’

Published on

-Advertisement-

అపూర్వమైన ఆరోగ్యానికి ‘ఇప్ప పువ్వు లడ్డు’ – ఉట్నూర్‌లో మోవా లడ్డూల తయారీ కేంద్రం ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్ఉట్నూర్ మండల కేంద్రంలో ‘మోవా లడ్డూల’ తయారీ, విక్రయ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ తొడసం రాధాభాయ్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా స్థానికంగా తయారు చేసే ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇవి ప్రత్యేకంగా ఇప్ప పువ్వు (మహువ) తో తయారుచేసిన ఆరోగ్యకర లడ్డూలు కావడంతో ప్రజలు వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఇవి ఎంతో పోషకవంతంగా ఉండి శక్తిని అందిస్తాయని తెలిపారు. కేంద్రంలో లభించే లడ్డులు, పచ్చడ్లు, ఐటిడిఎ ఆధ్వర్యంలో తయారయ్యే సరుకులకు మొదటి బోణీ చేసి, అధికారికంగా అమ్మకాలను ప్రారంభించారు.

స్థానిక మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కేంద్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్,...

సర్పంచ్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్ | ఆదిలాబాద్  రూ. 34 లక్షలతో నిర్మించిన ఖోడద్ గ్రామ బ్రిడ్జి ప్రారంభం మౌలిక వసతుల కల్పనే ప్రథమ...

More like this

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్,...