పిల్లల అభ్యాసంపై ఆందోళనలు..

Published on

📰 Generate e-Paper Clip

పిల్లల అభ్యాసంపై ఆందోళనలు: సంప్రదాయ విలువలకు దూరం..తల్లిదండ్రులదే బాధ్యత?

మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పిల్లల అభ్యాసం పై చాప కింద నీరులా ఆందోళనలు మొదలవుతున్నాయి. “మొక్కై వంగనిది మానై వంగునా?” అనే సామెత పిల్లల పెంపకంపై నేటికీ వర్తిస్తుంది. భారతీయ సంప్రదాయంలో పిల్లలకు ఐదేళ్ల వయస్సు వచ్చాక అక్షరాభ్యాసం ప్రారంభించడం, ‘ఓం నమః శివాయ’ వంటి దైవస్మరణతో విద్యారంభం చేయడం ఒక పవిత్ర ఆచారంగా ఉండేది. అయితే, కాలానుగుణ మార్పులతో ఈ సంస్కారం నీరుగారిపోతోంది.

నేటి పిల్లలు విద్యాభ్యాసం ప్రారంభించే దశలోనే ‘బా బా బ్లాక్ షీప్’, ‘డింగ్ డాంగ్ బెల్…’ వంటి అర్థం లేని పాటలు, నర్సరీ రైమ్‌లు నేర్చుకుంటున్నారు. వీటికి విలువలు, సంస్కృతి, నీతి బోదన వంటి అంశాలు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలు సంస్కారానికి దూరమవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలపై పెడ ప్రభావాలు పడటానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అని నిపుణులు సూచిస్తున్నారు.
మొక్క చిన్నప్పుడే వంగితేనే అది సూటిగా ఎదగదన్నట్టుగా, చిన్నతనంలోనే క్రమశిక్షణ, నీతి, దైవభక్తి, మానవతా విలువలను బోధించడం అత్యంత అవసరమని వారు చెబుతున్నారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో, మొబైల్, టీవీ, డిజిటల్ వినోదాల వలయం పిల్లలను మరింత దూరం చేస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలపై సమయాన్ని కేటాయించడం, వారికి భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలతో కూడిన విద్యను అందించడం ముఖ్యమని సూచిస్తున్నారు.

సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నేర్పే పాఠాలే భవిష్యత్‌ వ్యక్తిత్వానికి పునాది. అందుకే విద్య, సంస్కారం, క్రమశిక్షణలో మార్పు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Indian-Tradition-Parenting-Values-Child-Discipline

Latest articles

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల...

More like this

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...