దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

Published on

-Advertisement-

దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

మన భారత్, ఇచ్చోడ, నవంబర్ 6: దళిత బంధు పథకం పేరుతో మోసం చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో వెలుగులోకి వచ్చింది. తలమాద్రి గ్రామానికి చెందిన అక్కనపల్లి సుమన్ నుంచి దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి దాసరి భాస్కర్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. అయితే పథకం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో బాధితుడు సహా ముగ్గురు వ్యక్తులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భాస్కర్‌పై మోసం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ బండారి రాజు మీడియాతో వెల్లడించారు.

సీఐ మాట్లాడుతూ, “దళిత బంధు లేదా ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ప్రభుత్వ పథకాల కోసం ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...