ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే

Published on

📰 Generate e-Paper Clip

ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే — టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్
సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం — ఎటపాక పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

మన భారత్, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్ అన్నారు. ఎటపాక పంచాయతీ పరిధిలోని తుర్రంవారిగుంపు, మేడువాయి, రాయిగూడెం, బొజ్జిగుప్ప గ్రామాల్లో శనివారం ఉదయం ఇంటింటికీ తిరుగుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మువ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ, “వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడు గారిదే,” అని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అన్నదాత భరోసా పథకంను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధులు, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయడం హృదయాన్ని హత్తుకుందన్నారు. “ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసం నిలబెడుతున్నారు,” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

అలాగే రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ అభివృద్ధి పట్ల కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎటపాక సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గోడేటి రవికుమార్, వీఆర్వో రామ్మూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ సక్కుబాయి, సర్వేయర్ పసుపులేటి రాంబాబు, అనుగోజు మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest articles

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

More like this

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...