హైస్కూల్‌లో అదనపు కలెక్టర్ తనిఖీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ సోమ రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యకలాపాలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, వారి హాజరు వివరాలు, చదువుపై ఆసక్తి, బోధన విధానాలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిని విద్యార్థుల శ్రేయస్సు, పాఠశాల పరిశుభ్రత, భద్రత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, భోజనం నాణ్యత మెరుగుపరచాలని, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల చదువు, హాజరుపై శాశ్వతంగా దృష్టి పెట్టండి” అని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఎంఈవో  శ్రీకాంత్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...