జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 81 మంది అభ్యర్థులు బరిలో!

Published on

-Advertisement-

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 135 నామినేషన్లకు ఆమోదం — 81 మంది అభ్యర్థులు బరిలో!

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మంగళవారం నాటికి ముగిసిన నామినేషన్ల దాఖలులో మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. వీటిలో ఫార్మాసిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున సామాజిక సంస్థలు, రైతులు, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.

బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరిశీలన ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. భారీగా నామినేషన్లు రావడంతో అధికారులు సమీక్షా ప్రక్రియను క్షుణ్ణంగా నిర్వహించారు. ఈ క్రమంలో 321 నామినేషన్లలో 135 నామినేషన్లను ఆమోదించి, 186 నామినేషన్లను తిరస్కరించారు.

ఎన్నికల శాఖ ప్రకారం, మొత్తం 81 మంది అభ్యర్థులు ఆమోదించబడిన 135 నామినేషన్లతో అధికారికంగా పోటీలో నిలిచారు. ఇక, వివిధ సాంకేతిక కారణాల వల్ల 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ప్రధాన పార్టీల అభ్యర్థులైన నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్), లంకల దీపక్ రెడ్డి (బీజేపీ) నామినేషన్లు సక్రమంగా ఆమోదం పొందాయి. నవీన్ యాదవ్ మూడు సెట్లు, మాగంటి సునీత నాలుగు సెట్లు, దీపక్ రెడ్డి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ల ఆమోదం అనంతరం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు గడువు ఉండగా, ఆ తర్వత తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Latest articles

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన...

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం...

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు....

More like this

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన...

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం...