సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి: కలెక్టర్

Published on

-Advertisement-

మన భారత్ | ఆదిలాబాద్

ఆదిలాబాద్ ప్రజావాణిలో 97 అర్జీలు.. గడువులోగా పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మొత్తం 97 అర్జీలు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖలు వెంటనే పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సూచించారు.

ప్రజావాణి ద్వారా వచ్చిన సాధారణ ఫిర్యాదులను 30 రోజుల లోపు, అప్పీల్‌కు సంబంధించిన కేసులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే, ఒకే సమస్య పదేపదే ప్రజావాణికి రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం ఉండేలా అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఈ సందర్భంగా ఆదేశించారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు, మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...