ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు

లక్ష్మీపూర్ పివిటీజీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి సమస్యలు వివరించిన గ్రామస్తులు

తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTGs) కుటుంబాల సమస్యలను పరిష్కరించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, లక్ష్మీపూర్ గ్రామంలోని పివిటీజీ కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ప్రాథమిక వసతుల కొరతతో పాటు గృహ సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా నివాస గృహాలు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పివిటీజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. లక్ష్మీపూర్ గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తికి చేరేలా కృషి చేస్తామని, పివిటీజీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

పివిటీజీ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు గృహ వసతి, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే స్పందనపై వారు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ సర్పంచ్ రాధ మనోహర్, గ్రామానికి చెందిన పివిటీజీ కుటుంబాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...