ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి
మన భారత్, తలమడుగు లక్ష్మీపూర్ పివిటీజీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి సమస్యలు వివరించిన గ్రామస్తులు తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTGs) కుటుంబాల సమస్యలను పరిష్కరించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, లక్ష్మీపూర్ గ్రామంలోని పివిటీజీ కుటుంబాలు...