చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు..

Published on

-Advertisement-

పల్లి (బి) గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కల మందు వేయించిన సర్పంచ్ కట్కం సంజీవ్

5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించాలి : సర్పంచ్ సూచన

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్కం సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను పోలియో వంటి వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమానికి హాజరు కాని చిన్నారుల ఇళ్లకు వెళ్లి వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, అలాగే తల్లిదండ్రులకు పల్స్ పోలియో ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు.

చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...