మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మాన్కర్ నాగ్ సేన్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 701 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి 560 ఓట్లు దక్కాయి.
దీంతో మాన్కర్ నాగ్ సేన్ 141 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ప్రజల నమ్మకానికి తగిన విధంగా సేవలు అందిస్తానని నాగ్ సేన్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం స్థానం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
