టీచర్ కూకటి రాజన్న సేవలు మరువలేనివి..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

మాంగుర్ల  MPUPS పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఉపాధ్యాయుడు కూకటి రాజన్న ఆదర్శంగా నిలిచారు. పాఠశాల గోడలపై బొమ్మలు, అక్షరాలు, జాతీయ నాయకుల చిత్రాల పెయింటింగ్స్ కోసం రూ.10 వేలను పాఠశాల హెచ్ఎం జే. చంద్రకళకి విరాళంగా అందజేశారు.

గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు రాజన్న ఇదే విధంగా రూ.10 వేలు విరాళంగా ఇచ్చిన విషయం గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ యువకులు అందించిన రూ.21 వేల సహకారంతో పాఠశాల ఆవరణలో స్టేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడ లక్మణ్, ఉప సర్పంచ్ మునాఫ్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పి. సతీష్, టి. వినోద్ తదితరులు ఉపాధ్యాయుడు రాజన్న చేస్తున్న సేవలను కొనియాడుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవాభావం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామ విద్యాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest articles

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...

ఆ యువకులకు ఘన సన్మానం..

దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్...

More like this

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...