ముగ్గురు మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర భేటీ

Published on

-Advertisement-

మన భారత్ , తెలంగాణ:

తెలంగాణ రాజకీయాల్లో సోమవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమం ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజాభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అకస్మాత్తు భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సింగరేణి అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా నైనీ కోల్డ్ టెండర్ అంశంపై విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితుల్లో, ఆ పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సింగరేణి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు వ్యూహం రూపొందించడమే ఈ భేటీ ఉద్దేశమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం రాబోయే రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...