అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

Published on

📰 Generate e-Paper Clip

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

మన భారత్, తెలంగాణ: భూ భారతి సమస్యల పరిష్కారంలో జిల్లాల స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి జిల్లాల్లోని అడిషనల్ కలెక్టర్లు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ సీఎంవోకు వరుస ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం.

అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఫైళ్లపై సంతకాలు చేయాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు నేరుగా డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మధ్యవర్తుల ద్వారా డీల్ నడుపుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో భూభారతి దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రైతులను ఇబ్బందులకు గురిచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టంగా హెచ్చరించినట్లు తెలిసింది. భూభారతి ఫైళ్ల పెండింగ్ పరిస్థితిపై సంబంధిత అడిషనల్ కలెక్టర్లు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక కోరిన సీఎం, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూభారతి సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.

Latest articles

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న...

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు..

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి? మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని...

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

More like this

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..

🚆ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు.. రైల్వే కీలక నిర్ణయం మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న...

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు..

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి? మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని...

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...