కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం..

Published on

కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం..

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలం సావర్గాం గ్రామంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గజకంటి ప్రభాకర్ కుటుంబానికి ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి ఆర్థిక సాయం అందించారు. ఏప్రిల్ 28, 2025న కరెంట్ పోల్ నుండి కిందపడి ప్రమాదవశాత్తు మరణించిన ప్రభాకర్, ప్రతీ సంవత్సరం రూ.1,000తో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద భీమా పథకానికి సభ్యుడిగా ఉన్నారు.

ఈ పథకం కింద భార్య నామినీ అయిన గజకంటి కృష్ణవేణి అకౌంట్‌కు రూ.20 లక్షల పరిహారం బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా  రీజినల్ మేనేజర్ జి. రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

కుటుంబానికి భీమా మొత్తాన్ని అధికారికంగా అందజేస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని బ్యాంకు అధికారులు భరోసా ఇచ్చారు. గ్రామస్థులు, స్థానిక నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ కె. సురేష్, ఏరియా మేనేజర్ బాల జోహార్,తాంసి ఎస్‌బీఐ మేనేజర్ డి. శైలేష్, తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest articles

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల...

More like this

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...