అత్యవసరాల్లో ‘సీపీఆర్’ ప్రాణరక్షక చర్య..

Published on

గుండె పోటు అత్యవసరాల్లో ‘సీపీఆర్’ ప్రాణరక్షక చర్య – తాంసిలో అవగాహన సదస్సు

మన భారత్, తాంసి: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) అత్యంత కీలకమని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య వాణీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.

గుండె పోటు వచ్చిన వ్యక్తిని తక్షణమే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం తగ్గుతుందని వైద్య అధికారులు వివరించారు. శ్రావ్య వాణీ ప్రయోగాత్మకంగా సీపీఆర్ చేసే విధానాన్ని చూపిస్తూ… ఛాతీ నొక్కే పద్ధతి, శ్వాసనాళం తెరవడం, శ్వాసనివ్వడం వంటి అత్యవసర స్టెప్పులను పాల్గొనేవారికి వివరించారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో సాధ్యమైనంత త్వరగా సీపీఆర్ చేయడం కూడా ఎంతో ఉపయోగకరమని ఎస్సై జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో ఏఎస్సై ఉత్తమ్, హెల్త్ సూపర్వైజర్ తులసిరామ్, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్, పిహెచ్‌ఎమ్ సంపత్ కుమారి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల...

More like this

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...