వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం…మోదీ

Published on

📰 Generate e-Paper Clip

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం… ఐబీఎస్ఏ నాయకులతో ప్రధాని మోదీ చర్చలు

మన భారత్, జొహానెస్బర్గ్ :  జొహానెస్బర్గ్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌లో ఐబీఎస్ఏ (ఇండియా–బ్రెజిల్–సౌత్ ఆఫ్రికా) నాయకుల సమావేశం కీలకంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో విస్తృత చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ, వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలిచే వ్యవసాయ వ్యవస్థల కోసం ‘IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్’ ఏర్పాటు అత్యవసరం అని స్పష్టం చేశారు. డిజిటల్ రంగంలో అభివృద్ధి, సాంకేతిక వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ప్ ప్రాముఖ్యత ను కూడా వివరించారు.

విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఐబీఎస్ఏ ఇప్పటికే 40కి పైగా దేశాలకు అందిస్తున్న మద్దతు ప్రశంసనీయం అని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐబీఎస్ఏ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జి20 వేదికగా జరిగిన ఈ సమావేశం దక్షిణ గోళార్ధ దేశాల సహకారానికి కొత్త దిశగా భావిస్తున్నారు.

 

Latest articles

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ...

More like this

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...