సామూహిక వందేమాతర గీతాలాపన: జాతీయ స్పూర్తికి నాంది

Published on

-Advertisement-

సామూహిక వందేమాతర గీతాలాపన: జాతీయ స్పూర్తికి నాంది

మన భారత్, భైంసా: పట్టణంలోని పూలేనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యాపీఠం – సుభద్ర వాటిక నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం దేశభక్తి సందేశాలతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరై విద్యార్థులతో కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..వందేమాతరం గీతం దేశవ్యాప్తంగా స్వరాజ్య కాంక్షను రగిలించిన అమర గేయమని పేర్కొన్నారు. “తెల్లదొరల పాలనను కూలదోయడంలో వందేమాతరం ఓ మంత్రంలా పని చేసింది. ప్రజల్లో ఐక్యత, జాతీయత్వ భావాలను పెంపొందించింది” అని అన్నారు. ఈ మహోన్నత గేయాన్ని రచించిన బంకిమ్ చంద్ర ఛటర్జీ పాత్రను నేటి తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

దేశంలో కుల, మత విభజన విత్తనాలను కొన్ని రాజకీయ పార్టీలు పెంచుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. వందేమాతరం స్పూర్తిని అందరూ గ్రహించి, పూర్తి గీతాన్ని సరిగా ఆలపించాలి అని ఎమ్మెల్యే కోరారు.

కార్యక్రమంలో బోధకులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...