ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

Published on

-Advertisement-

ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

మన భారత్, పుట్టపర్తి: సేవ, ప్రేమ, మనిషితనం అనే గొప్ప విలువలకు సత్యసాయి బాబా ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పుట్టపర్తిలో కొనసాగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “భూమిపై మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా చూసిన దైవస్వరూపం సత్యసాయి బాబానే. ఆయన చేసిన సేవలకు సాటి ఇంకెవరూ లేరు. ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 200 కేంద్రాల ద్వారా సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు” అని పేర్కొన్నారు.

అదే సమయంలో బాబా సేవా భావాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ, “ప్రభుత్వాల కంటే వేగంగా, క్షణాల్లో స్పందించిన మహానుభావుడు సత్యసాయి. సమస్య ఎక్కడున్నా తెలుసుకుని వెంటనే సహాయం అందించే వారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా నడిస్తే సమాజం మరింత వెలుగొందుతుంది” అని అన్నారు.

సత్యసాయి బోధనలు, ఆయన సేవామార్గం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...