ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

Published on

📰 Generate e-Paper Clip

ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

మన భారత్, పుట్టపర్తి: సేవ, ప్రేమ, మనిషితనం అనే గొప్ప విలువలకు సత్యసాయి బాబా ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పుట్టపర్తిలో కొనసాగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “భూమిపై మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా చూసిన దైవస్వరూపం సత్యసాయి బాబానే. ఆయన చేసిన సేవలకు సాటి ఇంకెవరూ లేరు. ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 200 కేంద్రాల ద్వారా సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు” అని పేర్కొన్నారు.

అదే సమయంలో బాబా సేవా భావాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ, “ప్రభుత్వాల కంటే వేగంగా, క్షణాల్లో స్పందించిన మహానుభావుడు సత్యసాయి. సమస్య ఎక్కడున్నా తెలుసుకుని వెంటనే సహాయం అందించే వారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా నడిస్తే సమాజం మరింత వెలుగొందుతుంది” అని అన్నారు.

సత్యసాయి బోధనలు, ఆయన సేవామార్గం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...