కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం.. మంత్రి

Published on

-Advertisement-

కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం… టెలిమెట్రీ స్టేషన్లకు ఏపీ సహకారం లేదు: మంత్రి ఉత్తమ్

మన భారత్, హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై స్పష్టత రావాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కీలకమని, అయితే ఆ పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడంలేదని తెలంగాణ నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పారదర్శకంగా ఉండటం కోసం ఇప్పటికే 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా 20 స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటి కోసం ఏపీ ముందుకు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

“నీటిని ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటోందో తెలుసుకోవడానికి ఈ స్టేషన్లు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ తన వాటా నిధులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఆ నిధులనూ మేమే భరించేందుకు సిద్ధమని కేంద్రానికి చెప్పాను” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

కృష్ణా నీటి వివాదం నేపథ్యంలో టెలిమెట్రీ స్టేషన్ల ప్రాముఖ్యత పెరిగిన ఈ సమయంలో, ఏపీ అనుసరిస్తున్న వైఖరి సమన్వయానికి ఆటంకం కలిగిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...