మైథిలీ ఠాకూర్ మరో చారిత్రాత్మక రికార్డు..

Published on

📰 Generate e-Paper Clip

మైథిలీ ఠాకూర్ మరో చారిత్రాత్మక రికార్డు

మన భారత్, బిహార్: పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న మైథిలీ ఠాకూర్… ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా కొత్త చరిత్ర సృష్టించారు. బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఆమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

భారతదేశంలో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ ఠాకూర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2000 జూలై 25న జన్మించిన మైథిలీ, స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటి వరకు దేశంలోని ప్రతి MLA, MP 19వ లేదా 20వ శతాబ్దాల్లో జన్మించినవారే. 21వ శతాబ్దంలో జన్మించి ప్రజాస్వామ్య పోరులో అర్హత సాధించి గెలిచిన తొలి ప్రతినిధి మైథిలీ అవడం విశేషం. అంతేకాదు

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, మొదటిసారి పోటీ చేస్తూనే ఎమ్మెల్యే గా గెలవడం ఆమె విజయానికి మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. యువత రాజకీయాల్లోకే కాదు, ప్రజాసేవలో వెలుగులు నింపగలరని మైథిలీ ఠాకూర్ నిరూపించారని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రజలు ఇచ్చిన ఈ అపార మద్దతు తమ బాధ్యతను మరింతగా పెంచిందని మైథిలీ తెలిపారు. తాను ప్రజల కోసం, యువత కోసం, బీహార్ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...