పెరిగిన కూరగాయల ధరల..

Published on

-Advertisement-

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల దూకుడు.. మధ్య తరగతిపై మరింత భారం

మన భారత్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావం, కార్తీకమాసం డిమాండ్, రవాణా అంతరాయాలు కలిసి కూరగాయల మార్కెట్‌లో భారీ అస్థిరతను సృష్టించాయి. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోనే కాదు, ములుగు జిల్లాలోని గ్రామీణ రైతు బజార్లలో కూడా పలుచోట్ల కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. చిక్కుడు, గోబి, క్యారెట్, టమాటో, దోసకాయ, బీరకాయ, మిరపకాయ, వంకాయ వంటి ప్రతిరోజు వంటగదిలో ఉండే కూరగాయలే మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలుగా మారాయి. పావు కేజీకి కూడా రూ.30–35 కంటే తక్కువకు లభించడం లేదు.

ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండటం, పంటలు కుళ్లిపోవడం, సరఫరా గొలుసు దెబ్బతినడంతో మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడింది. రవాణా సమస్యలు, పెరిగిన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు స్థిరపడాలంటే సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలి. రాబోయే రెండు వారాల్లో వాతావరణం అనుకూలిస్తే మాత్రమే ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...