మద్యం, పేకాట కేంద్రంగా విద్యుత్ సబ్ స్టేషన్..?

Published on

కజ్జర్ల సబ్‌స్టేషన్‌లో మద్యం, పేకాట కేంద్రం..? ప్రజల్లో ఆందోళన

 

మన భారత్, తలమడుగు, నవంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల సబ్‌స్టేషన్ మద్యం, పేకాట స్థావరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి వేళల్లో సబ్‌ స్టేషన్ గదిలోనే మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికుల కథనం ప్రకారం , సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ లైన్‌మన్ కొడుకు విధి నిర్వహణ సమయంలోనే మద్యం సేవిస్తున్నాడని, దీంతో సబ్‌స్టేషన్ భద్రతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన కీలక కేంద్రంలో ఇలా నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంత నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రతిస్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజలు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...