పత్తి రైతులకు తేమ పేరిట మోసం..

Published on

-Advertisement-

రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తేమ పేరిట రైతులను దోచుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో  “జాగృతి జనం బాట” పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆమె, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రజా ప్రతినిధులను ధ్వజమెత్తారు.

“సీసీఐ కేంద్రాల్లో రైతులను తేమ పేరుతో తిరస్కరిస్తున్నారు. రైతులు పత్తి అమ్మడానికి మరే మార్గం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రభుత్వం గ్రహించాలి,” అని కవిత పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ రైతుల కోసం ఒక్క కదలిక కూడా కనిపించడం లేదని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. “సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌ లో ప్రచార సభలు ఆపేసి, రైతుల సమస్యలపై దృష్టి సారించాలి. పత్తి తేమతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరకు సీసీఐ కొనుగోలు చేయాలి” అని డిమాండ్ చేశారు.

కవిత పర్యటనలో ఆదివాసీలు, తెలంగాణ జాగృతి నాయకులు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె జిల్లా కేంద్రంలోని ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆదివాసీల సమస్యలు, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా కవిత ప్రజలతో నేరుగా మమేకమై, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్లు జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు.

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

More like this

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....