ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా నియామకంపై సుదర్శన్ రెడ్డికి ఘన సన్మానం 

Published on

-Advertisement-

ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా నియామకంపై సుదర్శన్ రెడ్డికి ఘన సన్మానం 

మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా క్యాబినెట్ హోదాతో నియమితులైన నేపథ్యంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ నియామకంపై శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బోధన్ పట్టణ ప్రముఖులు, ట్రస్మా సభ్యులు ఘనంగా సత్కరించారు.

సుదర్శన్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించిన ప్రముఖులు, “బోధన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సుదర్శన్ రెడ్డి కొత్త బాధ్యతల్లో మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.

ప్రముఖులు మాట్లాడుతూ, ఆయన కృషితో బోధన్ పట్టణం అభివృద్ధి దిశగా నడుస్తోందని, ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. “రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు అందించే నాయకుడు సుదర్శన్ రెడ్డి,” అని పేర్కొన్నారు.

తమ నాయకుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు నరసింహ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ సలహాదారులు యార్లగడ్డ శ్రీనివాస్, చక్రవర్తి, ట్రస్మా పట్టణ కమిటీ సభ్యులు హరికృష్ణ, దుష్యంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...