టీబీ రహిత గ్రామ లక్ష్యం..

Published on

ప్రజల్లో ఆరోగ్య అవగాహనతో ముందడుగు

మన భారత్, తాంసి, అక్టోబర్ 28 : గ్రామాలను టీబీ రహితంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) టీబీ నోడల్ అధికారి రాథోడ్ తులసీ రాం అన్నారు. సోమవారం తాంసి మండల కేంద్రంలోని సబ్‌ సెంటర్‌లో టీబీ వ్యాధి నిరోధక చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ (క్షయ) వ్యాధి పూర్తిగా నయం చేయగలిగేది, కానీ సమయానికి గుర్తించి చికిత్స చేయడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో టీబీ కేసులు తగ్గించేందుకు ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, అనుమానితుల స్క్రీనింగ్, టెస్టింగ్, మరియు తగిన చికిత్స అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో అనుమానితులుగా గుర్తించిన 11 మందిని ఎక్స్రే పరీక్షల నిమిత్తం రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎక్స్రే టెక్నీషియన్ రవీందర్, ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది తాంసి మండలాన్ని టీబీ రహిత మండలంగా మలచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని రాథోడ్ తులసీ రాం తెలిపారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...