ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా.!

Published on

-Advertisement-

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది, ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది, మద్యం షాపుల డ్రా ప్రక్రియ సోమవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 షాపులకు అధికారులు, కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా తీశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో 179 మద్యం షాపులకు డ్రా ముగిసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైన్స్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం షాపు లు దక్కించుకునేందుకు కొందరు సిండికేటై టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుండటంతో యువకు లు, వ్యాపారులు మద్యం వ్యాపారంపై పలువురు కన్నేశారు. పలుచోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కవగా దరఖాస్తులు వేశా రు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణం గా దరఖాస్తులు తగ్గినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజు పెట్టిన విషయం తెలిసిందే. ఎంపికైన దరఖాస్తు దారులు అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్, అనే వ్యక్తికి ఏకంగా మూడు వైన్ షాపులు 1,3,8, లాటరీ ద్వారా దక్కాయి.

– మన భారత్, స్టేట్ బ్యూరో.

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

More like this

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...