సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

Published on

📰 Generate e-Paper Clip

రైతుల కంట కన్నీళ్లు రానీయకుండా చూస్తామన్న ఎంపీ

గజ్వేల్, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీలో సోమవారం సిసిఐ (CCI) కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.“రైతులు కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో కంట కన్నీళ్లు రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని ఎంపీ స్పష్టం చేశారు. రైతులు తమ పత్తిని ఎక్కడో దూర ప్రాంతాలకు తరలించకుండా, వారికి సౌకర్యంగా ఉండేలా దగ్గర్లోనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, “గతంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.4 వేల రూపాయల పరిధిలో ఉండేది. కానీ నరేంద్ర మోదీ హయాంలో రైతు ఆదాయం పెరిగేలా కనీస మద్దతు ధర (MSP)ను రెట్టింపు చేస్తూ రూ.8,110 వరకు పెంచాం” అని వివరించారు. అదే సమయంలో దళారి వ్యవస్థను నిర్మూలించి, రైతులను దోపిడీ నుంచి కాపాడే చర్యలు తీసుకుంటామని చెప్పారు. “ఏదైనా కేంద్రంలో రైతులను ఇబ్బంది పెడితే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది” అని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిసిఐ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు.

– మన భారత్, గజ్వేల్ ప్రతినిధి

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...