మన భారత్ ,హైదరాబాద్:
పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల ద్వారా సమాచారం సేకరించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు స్వయంగా దుశ్చర్ల సత్యనారాయణతో మాట్లాడి వైద్య సహాయం అందించే చర్యలు ప్రారంభించారు. వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పూర్తి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రజా సమస్యలపై, ముఖ్యంగా జలసంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై కృషి చేస్తున్న దుశ్చర్ల సత్యనారాయణకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని సీఎం ఆకాంక్షిస్తూ, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని స్పష్టం చేశారు.
ఈ చర్యపై పర్యావరణ కార్యకర్తలు, సామాజిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సేవలో నిమగ్నమైన వ్యక్తుల పట్ల ప్రభుత్వం చూపుతున్న స్పందన ప్రశంసనీయమని అభిప్రాయపడుతున్నారు.
దుశ్చర్ల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన అభిమానులు, మిత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
