కూతురిని తీసుకొస్తూ ప్రమాదం.. తండ్రి మృతి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ (నేరడిగొండ):
జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూతురిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్న తండ్రి ప్రమాదంలో మృతి చెందగా, బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

స్థానికుల వివరాల ప్రకారం, ఆరెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిరామ్ బుగ్గరాం పాఠశాలలో చదువుతున్న తన కూతురిని వేసవి సెలవుల కారణంగా స్వగ్రామానికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు తరలిస్తున్న మార్గమధ్యంలో జ్యోతిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్

మన భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై...

శంకర్ గౌడ్ మృతి పై రాజకీయ ఉద్రిక్తత..

మన భారత్, వరంగల్ (నర్సంపేట): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో...

ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి..

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...

జర్నలిస్టుల హక్కులకు ప్రాధాన్యం..

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (NUJ-I)...

More like this

కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్

మన భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై...

శంకర్ గౌడ్ మృతి పై రాజకీయ ఉద్రిక్తత..

మన భారత్, వరంగల్ (నర్సంపేట): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో...

ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి..

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...