కూతురిని తీసుకొస్తూ ప్రమాదం.. తండ్రి మృతి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ (నేరడిగొండ):
జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూతురిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్న తండ్రి ప్రమాదంలో మృతి చెందగా, బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

స్థానికుల వివరాల ప్రకారం, ఆరెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిరామ్ బుగ్గరాం పాఠశాలలో చదువుతున్న తన కూతురిని వేసవి సెలవుల కారణంగా స్వగ్రామానికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు తరలిస్తున్న మార్గమధ్యంలో జ్యోతిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...