ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) విజయ భాను తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ముఖ్యంగా హెవీ లోడ్ వాహనాలను నడపడంలో అనుభవం ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు రోజువారీ వేతనంగా రూ.1,000 చెల్లించనున్నట్లు తెలిపారు.

అలాగే కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని నిబంధనగా పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రోజుకు రూ.800 వేతనం ఇవ్వబడుతుందని వెల్లడించారు. తాత్కాలిక నియామకాలైనా, సేవల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు సమీప ఆర్టీసీ డిపోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అవసరమైన అర్హతలు, అనుభవం కలిగిన వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు అంతరాయం లేకుండా కొనసాగించడం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఎం విజయ భాను పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...