మన భారత్, ఆదిలాబాద్:
గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ భజన మండలి ప్రతిభ కనబరిచి నాలుగో బహుమతిని సాధించింది. మండలి సభ్యుల ఆధ్యాత్మిక గాన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి.
ఈ సందర్భంగా భజన మండలి సభ్యుడు ,తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు, సామాజిక కార్యకర్తగా ఉన్న తోట శివన్న విజేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు.
భజన పోటీల్లో సాధించిన ఈ విజయంతో 12వ వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
