జనవరి 7 వరకే అసెంబ్లీ సమావేశాలు..

Published on

-Advertisement-

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలను జనవరి 7 వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4న (ఆదివారం) సెలవు ఉండనుంది.

అయితే, అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలంటే తక్కువ రోజులు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

కొత్త సంవత్సరంలో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, హామీల అమలుపై చర్చలు కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...