మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన..

Published on

-Advertisement-

ఆదిలాబాద్‌లో ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

– రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ (CCU)ను మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు.

రిమ్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని, జిల్లా వైద్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు.

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

జిల్లా పర్యటన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...

ఆ యువకులకు ఘన సన్మానం..

దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్...

More like this

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...