మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన..

Published on

-Advertisement-

ఆదిలాబాద్‌లో ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

– రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ (CCU)ను మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు.

రిమ్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని, జిల్లా వైద్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు.

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

జిల్లా పర్యటన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...