ఎస్సైని కలిసిన పొన్నారి పాలకవర్గం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ పాలకవర్గం ఎస్సై జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాలకవర్గం సభ్యులు ఆయనను కలిసి గ్రామాభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొన్నారి గ్రామ సర్పంచ్ తలారి భూమన్న, ఉప సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు స్వామి, నరేష్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలన్న సంకల్పంతో పాలకవర్గం ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు.
