ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం

Published on

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్ రెడ్డి

మన భారత్, తెలంగాణ: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు రాష్ట్రంలో ఎక్కడా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన భారీ సభలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

గత ప్రభుత్వ రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని పేర్కొన్న సీఎం, తమ ప్రభుత్వం ఒకేసారి ₹20,614 కోట్ల రుణాలను మాఫీ చేసి రైతులకు పెద్ద ఊరట కల్పించిందని చెప్పారు. “KCR పాలనలో పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ మేము లక్షలాది కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయి” అని రేవంత్ అన్నారు.

ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం లబ్ధిదారులు లేకుండా ఒక్క ఊరూ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...