కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

Published on

📰 Generate e-Paper Clip

కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మన భారత్ – స్టేట్ డెస్క్ కాన్పూర్: దేశ రాజకీయ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో కాన్పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

శ్రీప్రకాశ్ జైస్వాల్ 2004 నుండి 2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం 2011 నుండి 2014 వరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు చేరువై పనిచేసిన నాయకుడిగా పేరుపొందారు. కేంద్ర మంత్రిత్వానికి ముందు 2000–2002 మధ్య ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (UPCC) అధ్యక్షుడిగా సేవలు అందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతగా ఆయనను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు.

శ్రీప్రకాశ్ జైస్వాల్ మృతి పట్ల అనేక అగ్ర నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన సేవలను జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...