అపూర్వమైన ఆరోగ్యానికి ‘ఇప్ప పువ్వు లడ్డు’

Published on

అపూర్వమైన ఆరోగ్యానికి ‘ఇప్ప పువ్వు లడ్డు’ – ఉట్నూర్‌లో మోవా లడ్డూల తయారీ కేంద్రం ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్ఉట్నూర్ మండల కేంద్రంలో ‘మోవా లడ్డూల’ తయారీ, విక్రయ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ తొడసం రాధాభాయ్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా స్థానికంగా తయారు చేసే ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇవి ప్రత్యేకంగా ఇప్ప పువ్వు (మహువ) తో తయారుచేసిన ఆరోగ్యకర లడ్డూలు కావడంతో ప్రజలు వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఇవి ఎంతో పోషకవంతంగా ఉండి శక్తిని అందిస్తాయని తెలిపారు. కేంద్రంలో లభించే లడ్డులు, పచ్చడ్లు, ఐటిడిఎ ఆధ్వర్యంలో తయారయ్యే సరుకులకు మొదటి బోణీ చేసి, అధికారికంగా అమ్మకాలను ప్రారంభించారు.

స్థానిక మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కేంద్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...